చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటయింది , ఆ మరి మాకు ముప్పయేల్లు వచ్చాక అయ్యిందా? అంటారా ,నేను చెప్పేది పాఠ్య పుస్తకాలూ కాకుండా కథలు,కవితల గురుంచి అదో వ్యసనం అయ్యింది.తర్వాత చాలామంది స్నేహుతులకు అంటించా లెండి. 9 వ తరగతిలో వుండగా అనుకుంటాను నారాయణ రెడ్డి గారి "విశ్వంభర" కొన్నాను, తర్వాత తిలక్ " అమృతం కురిసిన రాత్రి". మళ్లి మళ్లీ చదవటం వల్ల చాలావరకు నోటికీ వచ్చేవి. సరిగ్గా గుర్తు లేదు గానీ విశ్వంభర ఒపెనింగె మహేష్ బాబు సినిమాల చాలా బాగుంటుంది - పుస్తకం మరొక్క సరి తీస్తే మరింత సరిగ్గా రాయగలననుకుంట , ట్రై చేస్తాను .
ఇవన్నీ, నిద్రలో, బాధలో, సంతోషంలో irrespective of any feeling - నన్ను వెంటాడుతాయి
"నువ్వు పుట్టక ముందే తల మీద నీలితెర
కాళ్ళ కింద దూలిపొర"
అని మొదలు పెట్టి -
" చీకటి మూకల మధ్య , రక్కసితనం పెంచుకున్నఉక్కు కాకుల మధ్య"
అని ఇప్పటికి ఎప్పటికి సరిపోయే లోక వర్ణన చేస్తారు సినారె.
జీసస్ ను శిలువ వేసే సందర్భాన్ని -
"పడమటి కొయ్యకు బంధించి , పదును చీకట్ల మేకులు దించి
నల్లనల్లగా నవ్వింది అజ్ఞానం" అని వెలుగు పై చీకటి యొక్క తాత్కాలిక విజయం తో పోల్చుతారు .
తిలక్ గారు -
secularism గురుంచి టీవీ లోనో , పత్రికలోనో చూసినప్పుడల్లా, మతం ప్రస్తావన వచ్చినప్పుడల్లా
secularism గురుంచి టీవీ లోనో , పత్రికలోనో చూసినప్పుడల్లా, మతం ప్రస్తావన వచ్చినప్పుడల్లా
"ఏ దేశ సంస్కృతి కాదు ఒక స్టిర బింధువు
అది అనేక నదీనదాలు కలిసిన అంతస్సింధువు"
అనే మాట గుర్తుకు వస్తుంది - మా దేశం మంచిది,మన దేశమే మంచిది అన్న భావన కలిగినప్పుడల్లా
"శ్రీరాముడి శ్రీకృష్ణుడి జన్మస్తానం, మరి కంసుడికి , దశకంతుడికి కాదా? అని ప్రశ్నిస్తుంది
వీటన్నికన్న ఎప్పుడో ఏదో తెలుగు పత్రికలో చదివిన కవిత తీవ్రంగా వెంటాడుతుంది , కనీసం ఇది ఎక్కడ వ్రాసుకోలేదు కుడా - దాంట్లో వున్న తీవ్రత వల్ల కావచ్చు సగం మాత్రం ఇంకా గుర్తుంది , అదే మళ్లీ మళ్లీ వెంటాడుతుంది
చీకటివై ,సిగరెట్ వై,సీసావై కరిగిపోతావో , కాలిపోతావో
నలుగ్గోడలే కదా సాక్ష్యం
దుఃఖం వైతరినిలో సైతం ధిక్కార చుక్కానివై సాగుతావ్
నీకన్ని అవసరాలే , అన్నీ అవరోధాలే
శిరసెత్తి నిల్చున్న పత్రకరుడా ... సిరమొంచి చెప్తున్నా